రేగా కాంతారావు ఆదేశాలతో కరోనా రోగుల సేవకు శ్రీకారం
మన్యం మనుగడ, పినపాక:
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా.కాంతారావు గారి ఆదేశాల మేరకు కరోనా బాధితులకు వితరణ
పినపాక మండలం తోగ్గుడెం పంచాయతీ తోగ్గూడెం గ్రామంలో గత కొద్దిరోజులుగా 70 కుటుంబాలు కరోనాతో బాధ పడుతున్న విషయం విదితమే.. ఈ విషయాన్ని గమనించి తోగ్గుడెం గ్రామానికి చెందిన మాతృ అభయా ఫౌండర్ రామటెంకి.రమేష్, వారి సహోదరుడు రామటెంకి.నర్సింహారావు చేతుల మీదుగా వారి తండ్రి రామటెంకి.లక్ష్మయ్య జ్ఞాపకార్థం గా ప్రతీ ఇంటికి ఐదు రోజులు సరిపోను బియ్యం, కూరగాయలు వంట సామగ్రి తోగ్గూడెం, గోవిందాపురం గ్రామాలలో పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి.నరసింహరావు, కటకం.గణేష్. పంచాయితీ ఉపసర్పంచ్ బుస్సి. శ్రీనివాసరావు, బండా. కవిత, కారుకురి.తిరుపతి , వనం.సంపత్, పుప్పాల. నర్సింహ రావు , బండా. మనోజ్ రెడ్డి, బుడగం.సందీప్ రెడ్డి, చిర్రా.ఉప్పలయ్య, చీమల.పాపయ్య, పళ్ళ.మధుసుధన్ రెడ్డి, తోలెం. నరసింహారావు, గోగ్గేల. సాగర్, తాటి.రామకృష్ణ, ఈసం.రవి తదితరులు పాల్గున్నారు.
Post A Comment: