CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన పోడు భూమి దారులకు అండగా రేగా కాంతారావు

Share it:

 


 


ద్విచక్ర వాహనంపై వెళ్లి భూములు పరిశీలించిన రేగా


 మన్యం టీవీ

 దుమ్ముగూడెం:

పోడు భూముల సమస్యల పోరాటానికి ఈరోజు దుమ్ముగూడెం మండలం పైడి గూడెం గ్రామానికి తెలంగాణ విప్ రేగా కాంతారావు పర్యటించడం జరిగింది. పైడి గూడెం గ్రామం మరియు చుట్టూ ఉన్న గ్రామ ల గిరిజనులు రేగా తో మాట్లాడుతూ, మేము గత ముప్పై సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే మా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇలా పోడు వ్యవసాయం  చేసుకుంటూ బ్రతుకుతున్న మా దగ్గర నుంచి ఫారెస్ట్ అధికారులు అన్యాయంగా  భూములను లాక్కొని తమను కొడుతున్నారని , తాము సాగుచేసిన పత్తి, కంది పంటలను అన్యాయంగా ట్రాక్టర్లతో తొలగించడం వంటి పనులు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు అని అని గిరిజనులు  వాపోయారు. ఈ సందర్భంగా తెలంగాణ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ  గిరిజనులకు జరుగుతున్న పోడు భూముల సమస్యల కొరకు ప్రభుత్వంతో గత ఆరు నెలల నుంచి చర్చలు జరుపుతున్నాను. దీనికిగాను పోడు భూముల పై ఫాస్ట్ అధికారులు చేసిన దాడులను తక్షణమే ఆపాలని ప్రభుత్వం నుంచి స్టే ఆర్డర్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పైడిగూడెం గ్రామ పరిధిలో ఉన్న భూములపై ఫారెస్ట్ అధికారులు చేస్తున్న దౌర్జన్య పనులను ఆపాలి అని సంబంధిత ఫారెస్ట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పనులను నిలిపి వేయడం జరిగింది. అదేవిధంగా తొందరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న అటవీ శాఖ అధికారులతో పోడు సమస్యల సాధనకై మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఈ పోడు సమస్యలు తీర్చడం కోసం తొందరలో ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించి అర్హులకు పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ వెంకట్రావు, దుమ్ముగూడెం జడ్పిటిసి తేల్లం సీతమ్మ, ఎంపీపీ రేస్ లక్ష్మి , సర్పంచులు పొడియం మంగమ్మ  సొడి జ్యోతి, టిఆర్ఎస్ కార్యకర్తలు, పైడి గూడెం గ్రామ యువత మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: