మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని తుమ్మల చెరువు గ్రామం మరియు చింతగుప్ప గ్రామంలో ఇటీవల జరిగిన ఫారెస్ట్ అధికారులకు మరియు పోడు భూములు రైతులకు జరిగిన దాడుల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో భూముల సమస్యల కోసం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుండి అశ్వాపురం వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు గారికి ఇల్లందు మండలం సుభాష్ నగర్ లో స్వాగతం పలికి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈడబ్ల్యుసిఏ నాయకులు కల్తీ వీరమల్లు, బుగ్గ రామనాథం, జోగ రామబ్రహ్మం, చాట్ల శ్రీనివాసరావు, గుమ్మడి పాపారావు, ఈసం రాంబాబు, గీతపల్లి ఎర్రయ్య
మరియు తుడుందెబ్బ నాయకులు పాపారావు, ముక్తి రాజు, జబ్బ రామ్మూర్తి, కొమరం బుచ్చయ్య, వజ్జా నిర్మల, గుమ్మడి అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: