మన్యం మనుగడ, పినపాక: పినపాక మండలం లోని
ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్ లో గల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు 130వ జయంతి వేడుకలు ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతీయులందరికీ స్పూర్తి ప్రదాత అని,నిమ్న కులాల వారు అనిచివేతకు గురవుతున్న సమయంలోరాజ్యాంగాన్ని రచించి, హక్కులను కాపాడారని అన్నారు అన్నారు.ఆర్థికవేత్త, న్యాయకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం, అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు,భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి శేఖర్ వర్మ, వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ చైర్మన్ భద్రయ్య, సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, వార నరసింహారావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: