మన్యంటివి:నుగూరు వెంకటాపురం
ఈరోజు వెంకటాపురం మండల రెవెన్యూ కార్యాలయం యందు బోదాపురం గ్రామ ప్రజలు తమూ గత 100 సంవత్సరాల నుండి ఇల్లు లు కట్టుకుని నివాసం ఉంటున్న తమ గ్రామాని ఒక వ్యక్తి తన గ్రామమని కొలిపించుకోని కంచె కట్టుకొని మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళనీయడం లేదని తమకు న్యాయం చేయాలని తాసిల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాక ముందు నుండి గత 100 సం" నుండి ఇంటి పట్టాలు ఉండి తాత ముత్తాత ల నుండి నివాసముంటున్న ఆదివాసీలను, ఆదివాసి గ్రామాన్ని ఒక ప్రైవేటు వ్యక్తి తన గ్రామం అని రెవిన్యూ సిబ్బంది తో సర్వే చేయించుకొని ఊరు చుట్టూ కంచె వేసి ప్రజల్ని ఇళ్లలోకి వెళ్లనీయకుండా ఇల్లు కాలీ చేయాలని గొడవ పెట్టడం ఇది జీవించేహక్కును ఉల్లంఘించడమేనని దీనిపైన అధికారులు తక్షణమే స్పందించి బోదాపురం గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు ఈకార్యక్రమంలో పి.ఎ.సి.యస్.ప్రెసిడెంట్ చిడెం మోహన్ రావు, యం.పి.టి.సి రవి గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: