మన్యం టీవీ మంగపేట.
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలొనే తమ ధాన్యంను విక్రయించుకోవాలని డిఆర్డిఏ డిపిఎం గోవింద్ చౌహాన్ అన్నారు.గురువారం మంగపేట మండలంలోని బోర్ నర్సాపురం గంపోనిగూడెం గ్రామాల్లో ఐకేపి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి వారికి ధాన్యంను కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలొనే తమ ధాన్యంను విక్రయించుకోవాలని అన్నారు.అనంతరం తిమ్మం పేట చేరుపల్లి కోమటిపల్లి మల్లూరు నరసింహ సాగర్ రాజుపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను మంగపేట ఐకెపి ఏపిఎం అప్పారావు వ్యవసాయ శాఖ అధికారి చేరాలు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సిసిలు చంద్ర మౌళి,జనార్దన్,శ్రీను,తార,రైతులు పాల్గొన్నారు.
Post A Comment: