ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్
మన్యం టీవీ,అశ్వాపురం :భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి ని భారత రాజ్యాంగ పరిరక్షణ దినం గా ప్రకటించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్ కోరారు, 130వ జయంతి సందర్బంగా అశ్వాపురం భవన నిర్మాణ కార్మిక సంగం కార్యాలయం లో ఏఐటీయూసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్, నాయకులు మేలపురి సురేందర్, రెడ్డి చిలక విశ్వనాధం, మల్లెబోయిన లింగయ్య, తోట వెంకటనర్సయ్య, గుండ్రం సైదిరెడ్డి, రెడ్డిరాజుల హరీష్, శివ, రాజు, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
Post A Comment: