టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సంక్షేమం
20 మంది లబ్ది దారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన మణుగూరు జడ్పీటీసీ, ఎంపీపీ
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు మండల పరిధిలోని పగిడేరు, సాంబయి గూడెం,దమ్మక్క పేట,తిర్లాపురం,రామానుజవరం గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు 20 మంది లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1,00,116. కళ్యాణ లక్ష్మి చెక్కులను 20 మందికి రూ.20,02,320 రూపాయల చెక్కులను స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని,అందుకు కరోనా సమయం లోనూ తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమమే అందుకు నిదర్శనమని మణుగూరు జడ్పిటిసి పొశం.నర్సింహారావు అన్నారు.సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా నేపథ్యం లో ఇబ్బందులు కొనసాగుతున్నప్పటికీ,ఒక అన్నలా,మేనమామ లా పేదింటి ఆడపడుచుల పెళ్ళికి అండగా నిలబడుతున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయ కుమారి,మండల,పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: