CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్‌

Share it:

 


జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటా..కే టీ ఆర్

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలను రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆదివారం నగరంలోని జలవిహార్‌లో టీయూడబ్ల్యూజే సభ్యులతో జరిగిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటున్నానని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అడ్డుంకులున్నాయని వాటిని కూడా చూస్తానని హామీ ఇచ్చారు.

జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. గల్లీ నుంచి హస్తిన వరకు సత్తాచాటిన జర్నలిస్టులకు రుణపడి ఉంటామన్నారు. జర్నలిస్టులు ప్రశ్నించాల్సిందే.. మేము వారికి చేయాల్సిందే. మరణించిన 260మంది జర్నలిస్టు కుటుంబాలకు లక్ష చొప్పున సహాయం చేసాం. వారి పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివిస్తాం. బీజేపీ పాలిత గుజరాత్ లో కేవలం వెయ్యి అక్రిడేషన్ కార్డులు మాత్రమే ఉన్నాయి.  తెలంగాణ లో 19150 మందికి అక్రిడేషన్ కార్డ్ లు ఇచ్చాం.

Share it:

TELANGANA

Post A Comment: