మన్యం టీవి,కరకగూడెం: మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక గిరిజన బాలుర ఉన్నత పాఠశాల(చిరుమళ్ళ),భట్టుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి,మధ్యహ్నం భోజనాన్ని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....విద్యార్థులు కరోనా బారిన పడకుండా కరోనా నిబంధనలు పాటించి,మాస్క్ పెట్టుకునేలా ఉపాధ్యాయులు భాద్యత తీసుకోవాలని తెలిపారు.విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సామాజిక దూరం పాటించి,విద్యార్థులకు అర్థం అయ్యేలా పాఠ్యాంశాలను బోధించాలని కోరారు.విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు,అవార్డును అందుబాటులో ఉండాలని సూచించారు.విద్యార్థులకు సంబంధించిన సదుపాయాలు సక్రమంగా అమలు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీను,ఎంపివో సునీల్,స్థానిక సర్పంచ్ పాయం నర్సింహారావు,సెక్రెటరీ అనూష,పాఠశాల ప్రధానోపాధ్యాయులు దారవాత్ జగన్,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: