ఎస్ ఎఫ్ ఐ ములుగు జిల్లా అధ్యక్షులు తోకల రవి
మన్యం టీవీ ఏటూరునాగారం:-
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏటూరు నాగారం మండల కమిటీ ఆధ్వర్యంలో వీర్రాజు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు తోకల రవి మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో శానిటైజర్ లు మాస్కులు అందించలేదని, పాఠశాల పట్ల పూర్తి స్థాయి పాఠ్య పుస్తకాలు అందించలేదని వసతిగృహాల్లో లో కనీస మౌలిక వసతులు సరిగా లేవని అదేవిధంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన దుప్పట్లు యూనిఫామ్స్ వెంటనే విద్యార్థులకు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకుల వంశీ, యశ్వంత్ ,స్వామి ,భాస్కర్ , శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: