మన్యం టీవీ మంగపేట.
తెలంగాణ లో పాఠశాలలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో కోవిడ్ నిబంధనల ప్రకారం
9&10 తరగతుల విద్యార్థుల కి ఎటువంటి ఆటంకం కలగకుండా పాఠశాలల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి
వీటికి తోడు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు
దీనిలో భాగంగా మంగపేట మండలం రాజుపేట జడ్పీ పాఠశాల లో స్థానిక సాహితీ పెట్రోల్ బంక్ యాజమాని &పాఠశాల పూర్వ విద్యార్థి అయినటువంటి పరుచూరి శ్రీనివాసరావు గత సంవత్సరం స్వర్గస్తులైనారు .వారి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు సాహితీ ,సంస్కృతి సోమవారం నాడు విద్యార్థులకు
మాస్కులు ,శాని టైజర్లు ,సుమారు వందకి పైగా వాటర్ బాటిల్లు
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో విద్యార్థుల కు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లి తండ్రులు, రాజుపేట గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మంజుల సీనియర్ ఉపాధ్యాయిని జ్యోతి ,శ్రీనివాస్ ఉపాధ్యాయులు ప్రసాద్ ,రాధాకృష్ణ,,నారాయణ ,పావని,సరస్వతి, నాగరాజు,చంద్రప్రకాష్, లావణ్య
మరియు రాజుపేట గ్రామ యూత్ సభ్యులు రమేష్ పాల్గొన్నారు .
Post A Comment: