మన్యంటీవీ,దమ్మపేట: మండలంలోని నాగుపల్లి గ్రామంలో నాలుగు మండలాల స్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహించడం జరిగింది. ఓక వారం పాటు జరిగిన ఈ టోర్నమెంట్లో 25 జట్లు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క టోర్నీలో అధిక ప్రతిభను కనబర్చి ప్రత్యర్థి జట్టులు ఓడించి అంకంపాలెం ఆదివాసి యువకులు జట్టు ప్రధమ బహుమతి కైవసం చేసుకుంది. ద్వితీయ బహుమతి సత్తుపల్లి జట్టు గెలుపొందింది. ఈ యొక్క బహుమతిని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ద్వారా అందించడం జరిగింది. ఈ సందర్భంగా గెలుపొందిన జట్టు కెప్టెన్ వినోద్, వైస్ కెప్టెన్ బాలు మాట్లాడుతూ గెలుపొందినందుకు సంతోషం వ్యక్తపరుస్తూ ఆదివాసి యువకులు అన్నిరకాల క్రీడల్లో ప్రతిభ చూపెట్ట గలరని, మరి ఎక్కడ ఎలా పొరపాటు జరుగుతుందో నేషనల్ స్థాయికి చేరుకోవడానికి ఏమైనా రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయో తెలియడం లేదని మా యువతకు ప్రోత్సాహం అందిస్తే మా యొక్క ప్రతిభను నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కనబరుస్తాం అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ ఇస్లవత్ నాగమణి
కమిటీ సభ్యులు ఫణీంద్ర పండు, చైతన్య, బి శివాజీ, యన్ రాజేష్, అంకంపలెం సర్పంచ్ భరత్, పైడి సాయికుమార్, యువకులు వినోద్,బాలు,అంజి, వెంకీ,రాజు, కిట్టు, నర్సి, మధు, వాసు, అశోక్, సాంబ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: