మన్యం టీవీ,అశ్వాపురం: ఈరోజు అశ్వాపురం మండలం లో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి నుండి వచ్చిన చెక్కులను అశ్వాపురం మండలం లోని బోళ్ళ నర్సయ్య కు 60,000 రూపాయలు,చర్లగొండ పద్మ కు 38,000 రూపాయలు,చెరుకూరి నాగమ్మ కు 28,000 రూపాయలు చెక్కులను టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్, ఎంపీపీ ముత్తినేని సుజాత, చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, జిల్లా కో ఆప్షన్ సభ్యులు సంఘం అధ్యక్షులు ఎస్ కె ఖదీర్, స్థానిక సర్పంచ్ బానోతు శారద, ఎంపీటీసీ ఏనిక రవి, టిఆర్ఎస్ నాయకులు భానోత్ సదర్లాల్, చుంచు రామ్మూర్తి, మాజీ ఎంపిటిసి బండారి బలరాం, మిట్టగూడెం మాజీ ఉపసర్పంచ్ కొర్సం దుర్గారావు, మడిపెళ్లి రమేష్, యువజన నాయకులు వల్లబోజు మురళి, మందా హుస్సేన్, వల్లపు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: