-భాజపా సీనియర్ నాయకులు చిలకమర్రి శ్రీనివాస్.
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం బీజేపీ సీనియర్ నాయకులుమాజీ మండల అధ్యక్షుడు చిలకమర్రి శ్రీనివాస్ అధ్యర్యం లో సమావేశం మండలం లో నిర్వహించారు ఈ యొక్క సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మండల అధ్యక్షుడు ఎర్రంగారి వీరను కుమార్ ఒంటెద్దు పోకడతో పార్టీని బ్రష్టు పట్టించే విధంగాప్రవర్తిస్తున్నారు .
బీజేపీ మండల మోర్చ
కమిటీ లు మండలం లో సీనియర్ల ను సంప్రదింపులు జరపకుండా కొత్తగా పార్టీ లో చేరిన వారికి తొత్తులుగా మారి వారి సూచనలను పాటిస్తూ పార్టీ కట్టుబాట్లు ను పాటించకుండా ఇస్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు
పదవిని పార్టీ సీనియర్ మహిళలు ను కాదని అప్పుడే
పార్టీలో చేరిన మహిళకు పదవి
కట్టబెట్టడం ఎంత వరకు సమంజసం ఇట్టి విషయం గురించి మరియు బూత్ అధ్యక్షులు గురించి మండల
సీనియర్లు కలిసి మాట్లాడాలని ప్రయత్నించిన కలవక పోగా ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు,
కనీసం మండల అధ్యక్షుడు బాధ్యతలు కూడా సక్రమంగా
నిర్వహించడం లేదు. ఈ విషయం పై జిల్లా పార్టీ స్పందించి మండల అధ్యక్షుడికి తగు సూచనలు చేసి అతనిని దారిలో పెట్టవలసినదిగా కోరారు.
మండలఅధ్యక్షులు కార్యకర్తల అందరికి ఏ మీటింగు లు ఉన్నా ధర్నాలు ఉన్న తెలియ పర్చటం లేదు అధ్యక్షుడు మండలం లోని
కార్యకర్తలకు అందుబాటులో ఉండే విదంగా చర్యలు తీసుకోనగలరు. మండలం లోని సీనియర్
బిజెపి నాయకులు జిల్లా పార్టీకి ఈ విదంగా తమ అసంతృప్తిని తెలియ జేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్లు
వల్లిపల్లి బాలమురళి. కిసాన్ మొర్చా ములుగు జిల్లా కమిటీ సభ్యులు
దంతనపల్లి నరేందర్,
బూత్ కమిటీ సభ్యులు
పల్నాటి సతీష్,
చిలకమర్రి దనుంజయ, మటూరి నాగేందర్,
అల్లే నంద గదే సత్యం,
ఒంకటి సతీష్, సప్పిడి శ్రీను, మౌనిక, గోమాసు సావిత్రి, మదీరాల రాధ, దుర్గం ఆదెమ్మ, సునారు లక్ష్మీ,
గోమాసు రాజ్యలక్ష్మి,
కడియాల రాణి, గుర్రం వరలక్ష్మీ,
పల్నాటి మౌనిక,
సళ్లూరి రాజేందర్,
ఇప్ప సమ్మయ్య,
సునారీ మల్లయ్య,
గోమాసు నర్శింహారావు,
పట్టెం పగిడి
సాయి, పల్నాటి శ్రీను, చిలకమర్రి పుల్లయ్య,
పల్నాటిప్రవీణ్,
దీడి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: