మన్యంటీవీ,అశ్వారావుపేట:వ్యవసాయ సహాయ సంచాలకులు అప్జల్ బేగం ఆధ్వర్యంలో అశ్వరావుపేట రైతు వేదికలో రైతుబంధు సభ్యులకు, ఎరువుల డీలర్లకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆదేశానుసారం వచ్చే పది రోజులు ప్రతి డివిజన్లో వివిధ శాఖ అధికారులు, రైతు బంధు సమితి సభ్యులతో రైతు సమస్యల పై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ 10 రోజులు రైతులు తమ దగ్గరలోని రైతువేదికలకు తప్పనిసరిగా హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఏ అఫ్జల్ బేగం, రైతుబంధు సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్, ఏ ఓ నవీన్, అధికారులు నాయుకులు పాల్గొన్నారు.
Post A Comment: