మన్యం టీవీ చర్ల:
రావులపల్లి అంకిత భావం తో పార్టీకి చేసిన సేవలు మరువలేనివి అని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి అన్నారు. చర్ల మండలం లో ఆదివారం జరిగిన
భారతీయ జనతా పార్టీ చర్ల మండల సీనీయర్ నాయకులు రావులపల్లి రమేశ్ గారి సంతాప సభలో ఆమె మాట్లాడుతూ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని,ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటు అని,వారితో,వారి కుటుంబం తో ఉన్న అనుబందాన్ని సంతాప సభ లో గుర్తు చేసుకున్నారు.ఈ సంతాప సభలో భారతీయ జనతా పార్టీ జిల్లా
ఉపాధ్యక్షులు బిట్రగుంట క్రాంతి కుమార్,మండల కన్వీనర్ పుగాకు పూర్ణ చందు,గిరిజన మోర్చా ఉపాద్యక్షులు నక్క కన్నయ్య, దళిత మోర్చా ప్రదాన కార్యదర్శి మచ్చా రఘు,సీనియర్ నాయకులు సాధం లొకనాధం,ముత్తారం రత్తయ్య,బత్తుల వెంకటేశ్వర రావు,యువ
మోర్చా నాయకులు రాచకొండ అనిల్,కొండేటి చంద్ర శేఖర్,ఇర్పా అంజి బాబు,నల్లగట్ల అంబేడ్కర్,
చామంతుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: