మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి:అన్నపురెడ్డిపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీలకు,రెండు క్లస్టర్ కేంద్రాలుగా ఏర్పాటు చేసి,పెద్దిరెడ్డిగూడెం గ్రామంలో ఒక రైతు వేదికను,అన్నపురెడ్డిపల్లి గ్రామంలో ఒక రైతు వేదికను నిర్మించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు,అన్నపురెడ్డిపల్లి మండల వ్యవసాయ అధికారులు,రైతులు పండించే పంటలలో అధిక దిగుబడి సాధించేందుకు,చేపట్టవలసిన సాగు విధానం,తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు,ఎరువుల వినియోగం తదితర అంశాలపై,ది:05-02-2021 నుండి ది:10-02-2021 వరకు క్లస్టర్ కేంద్రాల వారీగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.అన్నపురెడ్డిపల్లి క్లస్టర్ రైతు వేదిక కేంద్రంలో ది:05-02-2021 న అన్నపురెడ్డిపల్లి,అన్నదైవం(తొట్టిపంపు) గ్రామాలకు,ది:06-02-2021 న తెల్లిజర్ల(మర్రిగూడెం),ది:08-02-2021 న అబ్బుగూడెం,ది:09-02-2021 న పెంట్లం గ్రామాలకు,పెద్దిరెడ్డిగూడెం క్లస్టర్ రైతు వేదిక కేంద్రంలో ది:06-02-2021 న పెద్దిరెడ్డిగూడెం,ది:08-02-2021 న గుంపెన,ది:09-02-2021 న ఊటుపల్లి,ది:10-02-2021 న నామవరం,నర్సాపురం గ్రామాల రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు,మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొగలరని,మండల వ్యవసాయ అధికారులు తెలియజేశారు.
Post A Comment: