మన్యం టీవీ,పినపాక :
మండల పరిధిలోని తొగ్గూడెం పంచాయితీ టేకులగూడెం గ్రామానికి చెందిన బాలుడు ధీర్గ సోమయ్య కాలు కుళ్లిపోవడంతో ఆపరేషన్ చేయించుకొని కృత్రిమ కాలుతో ఇంటి వద్ద ఉంటున్నాడు. అతనికి పినపాక టీఆర్ఎస్ పార్టీ తరుపున శుక్రవారం రూ.2 వేలు వితరణగా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, పీఏసీఎస్ అధ్యక్షుడు రవివర్మ,ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి,సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, పినపాక ఎంపీటీసీ సిహెచ్ సత్యం, ముఖ్య నాయకులు సోంపల్లి తిరపతి, కన్నె రమేష్, తోలెం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: