మన్యం టీవీ, ఏటూరునాగారం :
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఖాయమని,
పట్ట భద్రులు ఎన్నికల్లో పల్లా రాజేశ్వరెడ్డి గెలుపు లక్ష్యం గా తెరాస శ్రేణులు పని చేయాలి అని
ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ పిలుపునిచ్చారు.
ఈరోజు ములుగు జిల్లా గోవిందరవుపేట మండలంలోని పసర గ్రామంలో పల్లా రాజేశ్వరెడ్డి
గెలుపు లక్ష్యంగా ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల
ప్రచారంలో భాగంగా గోడ రాతలను వారు స్వయంగా పర్యవేక్షించారు.
ప్రతి మండలంలో మండల పార్టీ అధ్యక్షులు,పార్టీ శ్రేణులు విధిగా గోడ రాతలను రాసే బాధ్యత తీసుకొని వచ్చే వారికి సహకారాన్ని అందించాలి అన్నారు.
తెరాస అభ్యర్థి, రైతు బంధు రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వరెడ్డి గారు
ములుగు ప్రజల నూతన జిల్లా ఆకాంక్షను ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ములుగు జిల్లా ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు.
పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచన చేయాలి అని కోరారు.
ఈయొక్క కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ అలం రామూర్తి,మైనార్టీ జిల్లా నాయకులు
తహిర్ పాషా,యువజన నాయకులు రెనుకుంట్ల సురేష్,ములుగు సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ నెమలి బాలకృష్ణ,టి.ఆర్.స్వి నాయకులు ప్రశాంత్,పస్రా గ్రామ అధ్యక్షులు వర్ధం చందర్ రాజు,పస్రా గ్రామ ఎమ్మెల్సీ ఎన్నిక కన్వీనర్ గజ్జి మల్లికార్జున్, పాలకుర్తి శ్రీను తదితరులు ఉన్నారు.
Post A Comment: