మన్యం టీవీ,కరకగూడెం: మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పోలీస్ డిపార్ట్మెంట్ మొదటి కోవిడ్ వాక్సిన్ దుర్గారావు,అనంతరం కరకగూడెం ఎసై ప్రవీణ్ కుమార్ కోవిడ్ వాక్సిన్ తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఎసై మాట్లాడుతూ...ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నుండి ప్రజలను కపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వాక్సిన్ తీసుకోవడం చాలా మంచి నిర్ణయం అన్నారు.ప్రతి ఒక్కరూ కోవిడ్ వాక్సిన్ వినియోగించుకోవాలని ఎసై తెలిపారు.కరోనా వైరస్ బారిన పడిన వారు ఎవరు కూడా భయపడకుండా ధైర్యంగా ఉండి,వైద్యాకారులు చెప్పిన సూచనలు,సలహాలు పాటించాలని తెలిపారు.ప్రతి ఒక్కరూ అపోహలు వీడి ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ తీసుకుందామని అన్నారు.కోవిడ్ వ్యాక్సిన్ వలన మనకు ఎటువంటి ఇబ్బందులు,సమస్యలు ఉండవని సూచించారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం వైద్యాధికారి పర్షియ నాయక్,పోలిస్ శాఖ,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: