మన్యం టీవీ భద్రాచలం భద్రాచలం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం పరిధి లో ఈరోజు మధ్యాహ్నం మొదలైన యు సి సి ఐ ఎం ఎల్ గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ జతిన్ కుమార్ ఆధ్వర్యంలో గారి ఆధ్వర్యంలోపోడు భూముల పట్టాల కొరకు తదితర సమస్యలకు కై భద్రాచలం బ్రిడ్జి పాయింట్ నుండి 200 మందితో ప్రదర్శనగా వెళ్లి ఐటీడీఏ పీవో గారికి వినతి పత్రలు ఇద్దామని రాగా పి ఓ గౌతమ పోట్రు లేనందున ఏవో భీమ్ రావు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
👉🏿వారి డిమాండ్స్
అటవీ హక్కుల చట్టం ప్రకారం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి సర్వే చేసి ఇచ్చిన భూములను రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించాలి గిరిజనేతరుల పేద సాగు భూములపై హక్కులు కల్పించాలి
గిరిజనులకు అవసరమైన రుణాలు ఇతర వసతులు కల్పించాలి కొత్త దరఖాస్తులు స్వీకరించాలి సర్వే బృందాల అవినీతి అక్రమాలు అడ్డుకుని అర్హులైన వారందరికీ పట్టాలుఇవ్వాలి.
1/70గిరిజన చట్టం ప్రకారం కోర్టులో జడ్జిమెంట్ కేసులన్నీ పంచనామా చేసి గిరిజనుల భూములు అప్పగించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి
సాగుకు లాభదాయకంగా ఉన్న పోడు భూములలో గిరిజన పేదలకు పోడు కొట్టుకునే అవకాశం కల్పించాలి వారిపై ఫారెస్ట్ వారి దౌర్జన్యాన్ని అరికట్టాలి.
👉🏿ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా కన్వీనర్ షేక్ సొందుమీయ జిల్లా కమిటీ సభ్యులు వాసం మంగయ్య ఎర్ర బాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: