చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిది : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు తుమ్మల శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం నాయి బ్రాహ్మణలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటు 250 కోట్లు నాయి బ్రాహ్మణ సంక్షేమ నిధి ఏర్పాటు, నాయి బ్రాహ్మణ ఉచిత కరెంటు, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా నాయి బ్రాహ్మణలు ఉద్యమించాలని ప్రభుత్వానికి నిరసనగా 11 2 2021 రాష్ట్ర బందుకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ జిల్లా ప్రధాన కార్యదర్శి దడిగల మల్లేష్, నాయి బ్రాహ్మణ వర్కింగ్ ప్రెసిడెంట్ కడియాల సత్యనారాయణ, అశ్వరావుపేట నియోజకవర్గం నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షులు కొలిపాక అప్పారావు నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: