మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా
-పట్టించుకోని అధికారులు .
మంగపేట బోర్ నర్సాపురం గ్రామాల మధ్యలో గల గౌరారం వాగు నుంచి గత రెండు రోజులుగా అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ యజమానులు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు .మిర్చి కల్లాల పేరుతో ఇటుక బట్టీల తయారీకి భవన నిర్మాణాలు సైడు కాలువల కట్టడాలకు ఇసుకను ఆన్లైన్ డిడిలు పేరు ఒకటి తీసుకుని వాటిపై విచ్చలవిడిగా క్షేత్ర స్థాయి రెవెన్యూ అధికారుల కనుసైగలతో ట్రాక్టర్ యజమానులు దోచుకుంటున్నారు .అడ్డు అదుపు లేకుండాఇసుక ట్రాక్టర్లు తిరగడంవల్ల బోర్ నర్సాపురం వెళ్ళే రోడ్డు ధ్వంసమై బురద మయంగా మారి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నది . ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి .
Post A Comment: