CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా వాక్సిన్ పై అపోహలు వద్దు

Share it:

 


👉టీకా తీసుకున్న పినపాక తహశీల్దార్ ఉమా మహేశ్వరరావు

మన్యం టీవీ, పినపాక:కరోనా  వాక్సిన్ పై అపోహలు వద్దని పినపాక తహశీల్దార్ ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆయన శనివారం పినపాక ప్రాథమిక కేంద్రంలో కరోన టీకా చేయించుకున్నారు.ప్రజలు కరోన టీకా పై వస్తున్న వదంతులు నమ్మవద్దన్నారు.అనంతరం పినపాక ప్రాథమిక కేంద్రం వైద్యులు శివకుమార్ మాట్లాడుతూ...

టీకా తీసుకున్న 42 రోజుల తర్వాతే యాంటీబాడీస్‌ వృద్ధి చెందుతాయని వివరించారు. మొదటి డోస్‌ తీసుకున్న కేంద్రంలోనే రెండో డోస్‌ తీసుకోవాలని.. వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో త్వరలోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మున్ముందు ప్రతి కేంద్రంలో వంద మందికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు ఉన్నతాధికారులు చేస్తున్నట్లు తెలిపారు. 104కు ఫోన్‌ చేసి వ్యాక్సిన్‌పై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.

Share it:

TELANGANA

Post A Comment: