చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఏజెన్సీ గ్రామాల్లో సైతం ప్రజలు భారీ సంఖ్యలో విరాళాల ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం లోని మారుమూల గిరిజన గ్రామం వెంకటయ్య తండా లో రామభక్తులు నిధి సేకరణ ను ప్రారంభించారు. అందులో భాగంగా వెంకటయ్య తండా గ్రామం నుంచి కరిసలబోడు గ్రామం వరకు పాదయాత్ర నిర్వహించి గ్రామస్తుల నుంచి విరాళాలు సేకరించారు ఈ కార్యక్రమంలో రామ భక్తులు. చిట్టంసెట్టి లక్ష్మయ్య, గుగులోత్ మోహన్ నాయక్, భుక్య కుమార్ నాయక్, గుగులోత్ లక్ష్మణ్, గుగులోత్ రాంబాబు, గ్రామ సర్పంచ్ బాలాజీ, గ్రామస్తులు బాబూలాల్, లాలు, దేవా, వస్రాం, శంకర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: