గుండాల మన్యం టీవీ: కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో కూలీలకు తీవ్ర గాయాలైన సంఘటన ఆళ్లపల్లి మండలంలోని రాఘవపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఆళ్లపల్లి ఎస్ఐ సంతోష్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మర్కోడు గ్రామానికి చెందిన 16 మంది కూలీలు పత్తి తీసేందుకు ట్రాక్టర్లో వెళ్తుండగా రాఘవాపురం గ్రామం దగ్గర మేకలు అడ్డురావడంతో మేకలను తప్పించబోయి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు వెంటనే బోల్తాపడిన ట్రాక్టర్ ను పైకి లేపి గాయపడిన కూలీలను ప్రధమ చికిత్స కొరకు ఆళ్లపల్లి ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలు అవడంతో 108 ద్వారా కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై ఆళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Navigation
Post A Comment: