సిపిఎం మండల కార్యదర్శి - బతుల వెంకటేశ్వర్లు
మన్యం టీవీ, బూర్గంపాడు:
బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్లో ఆదూరి నరసింహారావు అధ్యక్షతన సిపిఎం పార్టీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సారపాక రాజీవ్నగర్, గాంధీనగర్, భాస్కర్ నగర్ లోని చాలా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని, అట్టి భూకబ్జాదారుల పై ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గారపాటి సంధ్య, చల్లా తిరుపతమ్మ రాణి, శాంతి, చిట్టెమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: