మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సురక్ష బస్టాండ్ లో ఆదివారం చిన్నారుల బంగారు భవిష్యత్ సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రెండు చుక్కల పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.5 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ పోలియో చుక్కలను వేపించుకోవాలి అని పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసి పొశం.నర్సింహారావు, ఎంపీపీ కారం.విజయకుమారి, పీఏసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,డాక్టర్.మౌనిక, వైద్య సిబ్బంది,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: