మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం నర్సాపురం బోరు గ్రామానికి చెందిన రైతులు మిర్చి కల్లాలకు గౌరారం వాగు నుంచి ఇసుకను తీసుకవెళ్తుంటే తిమ్మంపేట వీఆర్వో అడ్డుకొని రైతులను డబ్బులివ్వాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ సొసైటీ డైరెక్టర్ నర్రా శ్రీధర్, రైతులు ఎర్రంశెట్టి రామకృష్ణ, మన్నెం నాగేశ్వరావు, సామకృష్ణారెడ్డి, కాండ్రు శ్రీనివాసరావు, తదితరులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్ కు పిర్యాదు చేసి వారు విలేకర్లతో మాట్లాడుతూ నర్సాపురం బోరు గ్రామ శివారులో గౌరారం వాగును ఆనుకొని ఉన్న భూమిని తాను కొనుగోలు చేసానని, ఈ భూమినుండి ట్రాక్టర్లు వెళ్లవద్దంటూ అసభ్య పదజాలం ఉపయోగించి తిడుతున్నాడని ఆరోపించారు. వందల ఏండ్లుగా గ్రామం నుండి గౌరారం వాగుకు వెళ్లే దారిని వీఆర్వో కొనడమేమిటని ప్రశ్నించారు. డీడీ లు తీసుకుని ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ లను అడ్డుకొని డబ్బులు ఇవ్వాలంటూ లేదంటే ఇసుక తరలించ వద్దంటూ అడ్డు తిరగడం, తాను కొనుగోలు చేసానని చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న ఇసుకను తానే రైతులకు అమ్ముకోవాలనే దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు. తిమ్మంపేటలో స్థానికంగా ఉండి విధులు నిర్వర్తించాల్సిన వీఆర్వో బోరులో ఉంటూ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏమిటని ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయ్యి ఉండి రియల్ ఎస్టేట్ బిజినెస్మెన్ లాగా ప్రవర్తిస్తున్నాడని తెలియజేసారు. తిమ్మంపేట
వీఆర్వో మీద విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సొసైటీ డైరెక్టర్ నర్రా శ్రీధర్ఈసందర్బంగా కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక రైతులు నర్రా కిషోర్, ప్రవీణ్, నాగేశ్వరావు, సమ్మయ్య, రమణయ్య, నర్సింహారావు, మాధవరావు, శ్రీనివాస్, సాంబయ్య, శేషు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: