మన్యం టీవీ, అశ్వాపురం:లయన్స్ క్లబ్ ఆర్ సి గాజుల రమేష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నాడు అశ్వాపురం లయన్స్ క్లబ్ అధ్యక్షులు సుంకరి సురేందర్ ఆధ్వర్యంలో జగ్గారంలో గల ఆరీఫా-రోష్ని వృద్ధుల ఆశ్రమంలో వృద్దులకు 25 కేజీల బియ్యం బ్యాగ్, నిత్యావసర వస్తువులను గాజుల రమేష్ కుటుంబ సభ్యులు వృద్దులకు అందజేశారు.వృద్దులకు అన్నదానం నిర్వహించారు.లయన్స్ క్లబ్ మెంబెర్ అయినటువంటి కణితి నర్సింహులు నూతనంగా నిర్మిస్తున్న వృద్ధుల ఆశ్రమానికి తనవంతు సహాయంగా పదివేల రూపాయలు నగదు వితరణగా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రెసిడెంట్ సుంకరి సురేందర్, కొండల రావు, సర్వేశ్వరరావు, రమేష్,నాదెండ్ల ముత్యాల రావు,సజ్జా శ్రీనివాస్ రావు, గాజుల రమేష్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: