CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూమి కోసం పోరుకు సై అంటున్న ఆదివాసీ గిరిజన అడవి బిడ్డలు...

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలంలోని గుళ్ళ రేవు గ్రామ పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాలైన రాంపురం, ఎలుకలొడ్డు, గ్రామాల ఆదివాసీ గిరిజన అడవి బిడ్డలు గత  ఇరవై, ముప్పై సంవత్సరాలుగా అడవిని నమ్ముకుని పోడు వ్యవసాయం ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటూ జీవనం గడుపుతున్నారు. అడవి తల్లి ఒడిలో ఆనందంగా ఆడుతూ పాడుతూ గడుపుతున్న వారి జీవితాలలో ఒక్కసారిగా ఆనందం దూరం అయింది. వారి జీవనాధారమైన పోడు భూమిని అభివృద్ధి పేరుతో టి సోమవారం అటవీశాఖ అధికారులు గిరి పుత్రులను పోడు లోకి రాకుండా ట్రంచ్ తవ్వకాలను ప్రారంభించడానికి సన్నద్ధం కాగా...! ఇరు గ్రామాల ఆదివాసి గిరిజన పోడు రైతులు వారిని అడ్డుకున్నారు. దీంతో అధికారులు రైతుల మధ్య వాగ్వివాదం జరిగింది. రైతులు  ప్రాణ త్యాగానికైనా సిద్ధమే కానీ భూమిని మాత్రం వదలమని పట్టుపట్టడంతో చేసేదిలేక అటవీ అధికారులు అక్కడ నుండి వెనుదిరిగి పోయారు. మా గోడు ఆలకించి మా భూములు కి ప్రభుత్వం పట్టాలు ఇప్పించాలని వారు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: