మన్యం టీవీ వాజేడు. ములుగు జిల్లా వాజేడు మండలం ఎంపీడీవో ఆఫీసు నందు ది:19/1/2021 నాడు సర్వసభ్య సమావేశం వాజేడు మండల కేంద్రంలో నిర్వహించారు ఈ సమావేశానికి వాజేడు మండలం ఆదివాసి ప్రజాప్రతి నిధులైన సర్పంచుల ఫోరం అధ్యక్షులు పూస నరేష్.యాలం సరస్వతి. సాంబయ్య. ఎంపీటీసీ గొంది రమణ రావు. జడ్పీటీసీ అల్లడి పుష్పలత. హాజరై రాతపూర్వకమైన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ మేము ఆదివాసి ప్రజా ప్రతినిధులమైన మమ్మల్ని అగౌరవపరిచి మా గ్రామంలో అనేక సమస్యలు కుంటుపడి ఉన్న గతంలో జరిగిన సమావేశంలో చెప్పిన సమస్యలను ఎజెండా రిజిస్టర్ లో పెట్టకుండా ఆ సమస్యలు పరిష్కరించకుండా అదే ధోరణిలో అవలంభిస్తూ కాలయాపన చేసేరు. గౌరవ గిరిజన ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై ఒత్తిడి చేస్తూ గ్రామపంచాయతీలో ఏ విధమైన పలు పనులు చేయకపోతే ఆదివాసి ప్రజాప్రతినిధులైన వారికి నోటీసులు జారీ చేయడం రాత్రింబవళ్లు పనిచేస్తున్న ప్రజాప్రతినిధుల
మైన మాపై భయబ్రాంతులకు గురి చేస్తున్నారు వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణ లేకుండా సమస్యలను పరిష్కరించకుండా గ్రామపంచాయతీ పై భారం మోపుతున్నారు ఇకపై గిరిజన ప్రజాప్రతినిధులు మాకు గౌరవo కల్పిస్తూ గతంలో జరిగిన సమావేశంలో ఇచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ అధికారులు గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకొవలని సంబంధిత అధికారులకు విన్నవించారు ఇకపై నిర్లక్ష్యం చేసిన అధికారులపై పూర్తి స్థాయి చర్య కొరకు జిల్లా కలెక్టర్ గారికి ప్రజా ప్రతినిధుల మందరం విన్నవించుకుంటున్నాము ఆదివాసీ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో తెలియజేశారు.
Post A Comment: