మన్యం టీవీ, అశ్వాపురం: అశ్వాపురం మండలం కేంద్రంలో అంబెడ్కర్ కమ్యూనిటీ హల్ నిర్మించాలని ఈ రోజు అనగా సోమవారం నాడు మండల కేంద్రంలో రైతు వేదిక ప్రారంభించడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్-పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు,మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాలవ సంసోన్ వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే మండలంలో అత్యధిక శాతం దళితులు ఉన్నారని వారు ఏదైనా శుభకార్యాలు జరుపుకోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,ఫంక్షన్ హాల్స్ కి అద్దెలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. అని గత పది సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో సంబంధించిన అధికారులకు,ప్రజా ప్రతినిధులకు కలిసి వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని తెలుపగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మే నెలలో శంకుస్థాపనకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.ఈ సందర్భంగా వారికి మండల దళితుల తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ సీనియర్ నాయకులు మందా హుస్సేన్,ఇసంపల్లి పున్నారావు,కడారి శ్రీను,మేకల భాస్కర్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: