తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో సోమవారం జరిగిన క్షేత్ర ఆర్ట్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం లో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి ఆర్.కె.రోజా పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో చిత్రకారులను ప్రోత్సహించేందుకు రమేష్ గురజాల, డా!! నిశ్చిత, డా!! సుస్మా, ప్రవీణ్ అనే వారు క్షేత్ర ఆర్ట్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. తిరుపతి లో సోమవారం జరిగిన ప్రారంభోత్సవానికి జాతీయ స్థాయిలో ప్రముఖ చిత్రకారులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిరుపతి ఎస్.పి దంపతులు రమేష్ రెడ్డి, సుస్మారెడ్డి, తిరుమల సి.వి.ఎస్.ఓ దంపతులు గోపినాద్ జెట్టి, సుస్మా జెట్టి, ఎస్.ఇ.బి.శాఖ ఎస్.పి రిషాంత్, ఆనందరెడ్డి, నిర్వహకులు రూప్ చంద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: