మన్యంటీవీ ఏటూరునాగారం:
బాలకార్మిక వ్యవస్థ తోనే బాలల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని ఏటూనాగారం సిఐ కిరణ్ కుమార్, మంగపేట ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సిఐ కార్యాలయంలో ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలోని ఆపరేషన్ స్మైల్ ఇన్చార్జి మంగపేట ఎస్సై శ్రీనివాస్ అధ్యక్షతన లైన్ డిపార్ట్మెంట్ల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఏటూరునాగారం ఐసిడిఎస్ సిడిపిఓ హేమలత, సిఐ కిరణ్ కుమార్, మంగపేట ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ ఎవరైనా బాలలు తగ్గిపోయినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత సమాచారం పోలీసులకు అందించినట్లయితే దర్పన్ యాప్ ద్వారా వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగిస్తామని అన్నారు. 14 సంవత్సరాలలోపు బాలబాలికల తో ఎలాంటి పనులు చేయించాలని 15 నుంచి 18 సంవత్సరాల బాలబాలికలతో ఎలాంటి హాని కరమైన పనులు చేయించారని ఒకవేళ ఎవరైనా అలా చేయించినట్లయితే వారిపై బాల కార్మిక నిషేధ చట్టం 2016 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అన్నారు. టీమ్ సభ్యులంతా చైల్డ్ లేబర్ హాట్స్పాట్ అయినా ఇటుక బట్టీలు, హోటల్లు సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు, మిరప తోటలో తనిఖీలు నిర్వహించాలని వారు సూచనలు చేశారు 14 సంవత్సరాలలోపు బాలబాలికల ఎవరైనా పనిలో పెట్టుకుంటే తప్పకుండా వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా 14 సంవత్సరాలలోపు బాలబాలికల పనిలో పెట్టుకుంటే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. 15 నుంచి 18 సంవత్సరాలలోపు బాలబాలికల హానికరమైన పనిలో పెట్టుకుంటే బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి బాలలను బాలకార్మిక వ్యవస్థ నుండి కాపాడాలని అన్నారు. రిస్కీ సాయంతో నిబంధనలు పాటిస్తూ వ్యవహరించాలని వారు అన్నారు. అనంతరం స్పోర్ట్స్ స్కూల్ ప్రాంతాన్ని టీమ్ సభ్యులు సందర్శించారు. ఏటూరునాగారం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ,ఐసిపియస్ ప్రొటాక్షన్ ఆఫీసర్లు కృష్ణవేణి, హరికృష్ణ, లీగల్ కం ప్రొఫెషనల్ ఆఫీసర్ సురేష్ కుమార్, అవుట్ రీచ్ వర్కర్ రాజు, చైల్డ్ లైన్ ప్రతినిధులు సుమన్, గీత, రమ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: