మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు మణుగూరులో జరుగుతున్న ఆటల పోటీల గురించి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మణుగూరు జెడ్పీటీసీ పోశం నర్సింహారావు మాట్లాడారు.క్రీడలు ముగింపు రోజు జరిగే కార్యక్రమాలు విధి విధానాలు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఏడు మండలాల అధ్యక్షులు ముత్యంబాబు,అడపా అప్పారావు,పగడాల సతీష్ రెడ్డి,రావుల సోమయ్య,కోడి అమరేందర్,బొలిశెట్టి నవీన్,గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీష్,పాయం నర్సింహారావు,మొకాళ్ల వీరస్వామి,కుర్రి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: