CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల వలసలను అరికట్టాలి

Share it:

 



నూగూరు వెంకటాపురం


రాజ్యాంగం ద్వారా గుర్తించబడ్డ షెడ్యూల్ ఏరియాలో కి గిరిజనేతరుల వలసలను ప్రోత్సహించడం వల్లే ఆదివాసుల అస్తిత్వం దెబ్బతింటుందని జిల్లా ప్రధాన కార్యదర్శి రేగ గణేష్ అన్నారు. ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తలు సమావేశం నూగురు గ్రామంలో జరిగింది. ఈ సమావేశంలో గణేష్ మాట్లాడుతూ వలసలు వస్తున్న గిరిజనేతరులకు ఓటు హక్కు, రేషన్ బియ్యం, ఆధార్ కార్డు,మరి కొంతమందికి ప్రభుత్వ భూములలో భూమి హక్కు పత్రాలు కూడా కల్పించడం వల్లనే గిరిజనేతరుల వలసలు పెరిగాయని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బ్రతుకు తెరువు కోసం వలసలుగా వచ్చి  వ్యాపార రంగంలోనూ, రాజకీయ రంగాల్లోనూ, ఆర్థికంగా ఎదగడం కోసం ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కోట్ల రూపాయలు గడిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం అంబేద్కర్ కల్పించిన హక్కులను చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా అధికారుల అధికారుల నిర్లక్ష్య దొరనేనని ఇప్పటికైనా దీన్ని గుర్తించి రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డ హక్కులను చట్టాలను పూర్తిస్థాయిలో అధికారులు శ్రద్ధ వహించి అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని అని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఆదివాసీల దేహాలను మ్యూజియాల లో చూడాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడుతుందని ఆదివాసి సమాజాన్ని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పాయం కృష్ణ, ప్రతాప్,స్వాతి,నవీన్ ,గోపాల్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: