మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని రాంపురం, ఎలుక లొడ్డు, గ్రామాల ఆదివాసీ గిరిజన పోడు రైతులు మంగళవారం జూలూరుపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వైరా శాసన సభ్యులు లావుడ్యా రాములు నాయక్ ను కలిసి, అటవీ అధికారులు తమ పంట పొలాలకు పోనీయకుండా అడ్డుకుంటున్నారని, అటవీ అభివృద్ధి పనుల పేరుతోటి మా పోడు భూమిని లాక్కోవాలని చూస్తున్నారని, వాపోయారు...! పలు రకాల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అటవీ అధికారుల తోటి ఫోన్లో మాట్లాడి త్వరలో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, అప్పటివరకు పోడు రైతుల జోలికి పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, ఏఎంసి డైరెక్టర్ అలహావత్ నరసింహారావు, సీనియర్ నాయకులు నర్వ నేని పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: