*వ్యవసాయ ఆధారిత జిల్లా ములుగు..
*రైస్ మిల్లర్లు సమస్యలకు పరిష్కారం చూపండి.
*ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీష్
మన్యంటీవీ ఏటూరునాగారం:
ఈరోజు తెలంగాణా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీష్ మర్యాద పూర్వకంగా కలిశారు.
ములుగు జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా,ప్రజలు చాలా మేరకు రైతు వృత్తి పరంగా జీవనం సాగిస్తున్న జిల్లా.
ఈసారి వర్షాలతో చాలా మేరకు రైతులు దిగుబడి రాక ఇబ్బందులు ఎదురవ్వడం జరిగింది.
ప్రతి గింజను కొనే విధంగా ఆదేశాలు ఇవ్వాలి అని ములుగు జిల్లా పైన ప్రత్యేక దృష్టి ఉంచాలి అని
ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీష్ కోరారు.
అందుకు సానుకూలంగా స్పందించి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ములుగు జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి గింజను కొనుగోలు చెయ్యాలి అని ఆదేశించారు.
రైస్ మిల్లర్లు సాధక బాధలను రాష్ట్ర అధ్యక్షులు గంప నాగేందర్,ములుగు జిల్లా రైస్ మిల్లర్లు అధ్యక్షులు కాట్రగడ్డ సతీశ్ రైస్ మిల్లర్లు సమస్యలు వివరించారు.
తప్పకుండా ప్రభుత్వ పరంగా సమస్యలు పరిష్కారం చూపుటకు చొరవ తీసుకుంటాం అని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈయొక్క కార్యక్రమంలో ములుగు మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: