పలువురు ప్రముఖుల సంతాపం...
మన్యం టీవీ : జూలూరుపాడు,
మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జూలూరుపాడు మండల ప్రధమ మాజీ జెడ్పిటిసి ప్రస్తుత జెడ్ పి టి సి భూక్య కళావతి మామ గారైన భూక్య భీమా అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్, జూలూరుపాడు మండలం లోని కొమ్ముగూడెం చేరుకొని, భీమా గారి ప్రార్దివ దేహానికి పూల మాల ఏసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సంతాపం తెలిపిన వారిలో వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్ లాల్, ఎంపీపీ లావుడ్యా సోనీ, పలువురు నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, పలు గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉన్నారు.
Post A Comment: