మన్యంటీవీ ఏటూరునాగారం/ములుగు:
*తల్లిదండ్రులు లేని అడబిడ్డకు పెళ్లి ఖర్చుల సహాయం పది వేలు. రూపాయలను
స్వయంగా పెళ్ళికి వెళ్లి దీవించి సహాయం అందించిన ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్.
ఈరోజు ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి
చెందిన ముప్పారపు మానస వివాహానికి వెళ్లి తల్లి తండ్రులు లేన ఆ ఆడబిడ్డ పెళ్లి ఖర్చులకు సహాయంగాపది వేలు రూపాయలు అందించారు.జడ్పీ ఛైర్మన్. స్వయంగా ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ హాజరై నూతన దంపతులు మానస-నవీన్ లను దీవించి ఆశీర్వదించారు.
మనసకుతల్లిదండ్రులు లేని అమ్మాయిఅని తెలుసుకున్న జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ చలించిపోయారు.
వారు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మీ పథకం పేద ఇంటి బిడ్డలకు వరంలాగా మారింది అని అన్నారు.
నేనునీరుపేద కుటుంబం నుండి వచ్చిన వాన్ని మీలో ఒక్కడిని అన్ని కష్టాలు ఎరిగిన వ్యక్తిగా సహాయం చేశాను అని అన్నారు.
నాకు ఉన్నంతలో పేదలకు అండగా ఉండడం,సహాయం చేయడంలో మానసిక సంతృప్తి నిస్తుంది అన్నారు.
అనంతరం బొల్లోని పల్లి గ్రామానికి చెందిన కోటగిరి సుజాత స్వామి కూతరు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.మానస సాయి కుమార్ దంపతులను దీవించి ఆశీర్వదించారు.
వీరితో పాటు
మల్లంపల్లి ఎంపీటీసీమాచర్ల ప్రభాకర్, రాజు యాదవ్,రెనుకుంట్ల సురేష్,తహిర్ పాషా,గడదాసు సునీల్ కుమార్,మల్లా రెడ్డి, సర్దార్ పాషా,టి.ఆర్.స్వి నాయకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: