మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి సోజన్యం తో టిఆర్ఎస్ పార్టీ కల్చరల్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలలో మణుగూరు మండలం వాలీబాల్ జట్టుకు పది వేల రూపాయల విలువ గల స్పోర్ట్స్ షూస్ ను మణుగూరు టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈసందర్భంగా క్రీడాకారులు కు షూస్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసి పొశం.నరసింహారావు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీటీసీల ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు, మండల అధ్యక్షులు ముత్యం బాబు,ఆదివాసి ఉద్యోగుల సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షులు పోలేబోయిన అనిల్ కుమార్, కల్చరల్ విభాగ అధ్యక్షులు ఆవుల నరసింహారావు,అడపా వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: