CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మద్ది కొండ లో క్రీడలను ప్రారంభించిన సీఐ ఉపేందర్

Share it:

 



మన్యంటీవీ,అశ్వారావుపేట  మండల పరిధిలోని మద్ది కొండ గ్రామపంచాయతీలో నిర్వహించిన  ఏడు పంచాయతీలో వాలీబాల్ మరియు సెటిల్ టోర్నమెంట్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన అశ్వరావుపేట, దమ్మపేట మండల పరిది సీఐ ఉపేందర్ రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ ఉపేంద్ర మాట్లాడుతూ యువత ఎటువంటి చెడు ప్రలోభాలకు లోను కాకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం శుభ పరిణామమని అన్నారు. అలాగే త్వరలో పోలీస్ రిక్రూట్మెంట్ రాబోతుందని అర్హులైన యువతకి కోచింగ్ అందించడం జరుగుతుందని కాబట్టి  శిక్షణకు రావడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్ది కొండ సర్పంచ్ తాటి భవాని, తెరాస మండల నాయకులు కాసాని వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ నాగార్జున, తాటి రామకృష్ణ, వీఆర్ఓ కె శ్రీను, క్రీడాకారులు జమ్మిగూడెం, కాసెప్పగూడెం, రాచూరుపల్లి, మద్ధికొండ, అచ్యుతాపురం, గుత్తవారిగూడెం, తాళమడ మొదలైన గ్రామాల యువకులు పాల్గొన్నారు..

Share it:

TELANGANA

Post A Comment: