మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన గజ్జి శ్రీను గుండె పోటుతో మృతి చెందారు.ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో శ్రీను భార్య సుజాత ఇద్దరు పిల్లలు బాబు లోహిత్ చంద్ర ఇంటర్ ద్వితీయ సంవత్సరం, పాప ఖ్యాతి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.ఆమె పిల్లల్ని చదివించడానికి,కుటుంబ పోషణకు ఎటువంటి ఉపాదిలేక అనేక ఇబ్బందులు పడుతుంది.చాలా నిరుపేద కుటుంబం కావడంతో సుజాత కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది.శ్రీను కుటుంబానికి అశ్వాపురం హై స్కూల్లో 1995-96 సంవత్సరానికి చెందిన కొర్లకుంట కిషోర్ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా 5000 రూపాయల నగదు మరియు 50 కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కేకే ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ గద్దల నాగేశ్వరరావు,జాయింట్ సెక్రటరీ మచ్చా రమేష్,ట్రెజరర్ బిజగం ఈశ్వర్,ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్, షేక్ నయీయ్,నాగుల్ పాషా,బొక్షం రవి,కంఠం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: