మన్యంటీవీ,అశ్వారావుపేట: తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ద్వారా వెలువడిన మన్యం మనుగడ డిసెంబర్ మాసపత్రికను అశ్వరావుపేట మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కు ఇచ్చి చందదారుడుగా చేర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలపై మాసపత్రిక రావడం శుభపరిణామం అని ఈ యొక్క పత్రిక ను ఏజెన్సీ గ్రామాలలో ప్రతి బిడ్డకు చేరేంతవరకు నా వంతు కృషి అందిస్తానని అన్నారు. పత్రిక స్థాపించిన రేగా కాంతారావు కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీను, నరసింహా, మల్లికార్జున్, నాగేంద్ర, దిలీప్ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: