నూగురు వెంకటాపురం
ఈరోజు వెంకటాపురం మండల పరిధిలో ఉన్నటువంటి పాలెం వాగు ప్రాజెక్టు పిల్ల కాలువలను ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్, కాంగ్రెస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు జలి గంపల చంద్రకళాధర రావు సందర్శించారు ఈ సందర్భంగా ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రాజెక్టు మొదలు పెట్టింది దశాబ్దాలు గడుస్తున్నా ఈనాటి వరకు కనీసం ప్రాజెక్ట్ కింద 1కి.మి పరిధిలో ఉన్న గ్రామంలో కూడా సాగు నీరు అందని పరిస్థితి ఉందని రైతులు తమ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని పొలాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పి అనుకున్న రైతుల ఆశలు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆశలు అడియాశలు అయిపోతున్నాయి కనీసం పట్టించుకునే నాధుడే లేక రైతులు రెండు పంటలు పండించ లేకపోతున్నారు, కోట్ల రూపాయలు కేటాయించినా కూడా కాల్వల నిర్మాణాలు పూర్తి గాక ప్రాజెక్ట్ నీరు అంతా గోదావరి పాలు అవుతున్నది ఆరోజు హడావుడిగా ప్రాజెక్టు పూర్తి కాకుండా శిలాఫలకాలు పెట్టించుకున్న ప్రభుత్వం ఈనాటి కూడా కాలువలు పై దృష్టి సారించలేదు ఇప్పటికైనా అసంపూర్తిగా ఉన్న పిల్ల కాలువలను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో లో కాంగ్రెస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు జలి గంపల చంద్రకళ ధర రావు, సర్పంచ్ సమ్మయ్య ,పుల్లయ్య తదితర రైతులు పాల్గొన్నారు
Post A Comment: