మన్యం టీవీ : జూలూరుపాడు,
మండలంలోని గంగారం తండా, గాంధీనగర్,జూలూరుపాడు, గ్రామాలలో శనివారం జరిగిన, వివాహ శుభకార్యాలలో ముంబై ఇన్కమ్ టాక్స్ అధికారి, వైరా నియోజకవర్గ శాసనసభ్యులు, లావుడ్యా రాములు నాయక్ కుమారులు లావుడ్యా జీవన్ లాల్ పాల్గొని నూతన వధూవరులను ఆశ్విరదించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గుండెపుడి, జూలూరుపాడు, గ్రామాలకు చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకట్ రెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనీ, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, ప్రధాన కార్యదర్శి నున్నా రంగారావు, మండల టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుగులోత్ రాంబాబు, వివిధ గ్రామాల సర్పంచ్, లు యంపిటీసి, లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: