మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు ఏరియా స్టోర్ గ్రౌండు నందు దివంగత తాళ్లపల్లి తేజస్వి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా లాలూ11మరియు వీఎస్డి11 జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 47 బంతుల్లో 127 పరుగులు సాధించి వీఎస్డి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు ఆటగాడు శ్రీనాథ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షీల్డ్ మరియు 1000 రూపాయల నగదు బహుమతిని టిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ మీడియా ఇంచార్జి తాళ్లపల్లి యాదగిరి గౌడ్ అందజేశారు.ఈ కార్యక్రమంలో లాయర్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ యువజన నాయకులు బొశెట్టి రవి ప్రసాద్,లాలూ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: