మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని చింతిర్యాల లోని సర్వాయి గూడెం లో 3 సిసి రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు స్తంభాలు,ఏర్పాటు చేయాలని, పలు సమస్యల పై శనివారం మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను కలిసి సమస్యల ను వివరించి వినతిపత్రం అందజేశారు. సమస్యల పై విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నరసింహారావు, వార్డు మెంబర్ ఎస్.కె అబ్దుల్ భయుమ్,గ్రామస్తులు కోటేశ్వరరావు,రాంమూర్తి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: